ATP: అనంతపురం మార్కెట్ యార్డ్లో గొర్రెలు, గేదెల కొనుగోలు, అమ్మకాలు చేసే వ్యాపారులతో ఛైర్ పర్సన్ బల్లా పల్లవి శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మార్కెట్లో వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డ్ ప్రస్తుత పరిస్థితులు, సౌకర్యాల మెరుగుదలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు.