NTR: కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామ శివారులో 20 కిలోల గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయానికి సిద్ధం చేసిన తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీలేరు ప్రాంతం నుంచి తెచ్చిన గంజాయిని అమ్మేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నారు. నిందితులపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు.