MBNR: రాజకీయ రంగంలో బీసీలకు మరింత ప్రాధాన్యత కల్పించాలని మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. శనివారం హైదరాబాదులో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి సంజీవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా దేశాభివృద్ధికి కృషి చేద్దామన్నారు.