KDP: లింగాల మండలం అక్కులగారిపల్లెలో హరిస్వామి ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకొని శనివారం రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించనున్నారు. ‘న్యూ కేటగిరీ’ విభాగంలో జరిగే ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆరు రకాల నగదు బహుమతులు అందజేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పోటీలో పాల్గొనే రైతులు శనివారం లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.