VZM: రాజాంలోని జీఎంఆర్ గృహ సముదాయంలో ఫిబ్రవరి 1న జరిగిన జంట చోరీల మిస్టరీ వీడింది. ఈ కేసులో మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు అదనపు ఎస్పీ సౌమ్యలత తెలిపారు. వారి నుంచి రూ.32 లక్షల విలువైన 470 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.