NRML: సీఎం కప్ రాష్ట్ర స్థాయి తైక్వాండో క్రీడా పోటీలలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి నేడు మూడు కాంస్య పతకాలు సాధించారు. తైక్వాండో విభాగంలో నేహల్, జోయా, శ్రీహంష్ తమ ప్రతిభతో కాంస్య పతకాలు గెలుచుకుని జిల్లాకు గర్వకారణమయ్యారు. వీరికి శిక్షణ అందించిన కోచ్ వంశీ కృష్ణ కృషి ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.