VZM: గరివిడిలోని మసీదులో జరిగిన పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షల కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసిన ఆయన, అల్లా దీవెనలు అందరికీ మెండుగా లభించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.