T20 WC రెండో సెమీస్లో ఇంగ్లండ్పై భారత్ బుమ్రాతో ఆరంభంలోనే బౌలింగ్ చేయించాలని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించారు. బుమ్రాతో 5వ ఓవర్ వేయిస్తున్నారని, అప్పటికే ప్రత్యర్థి బ్యాటర్లు క్రీజులో కుదురుకుంటుండటంతో అతణ్ని సమర్థంగా ఎదుర్కొంటున్నారని పేర్కొన్నాడు. అరంభంలో బుమ్రాకు బౌలింగ్ ఇస్తే ప్రత్యర్థిని దెబ్బకొట్టగలడని, దీంతో మ్యాచ్ ఫలితం మారుతుందని సన్నీ అన్నాడు.