HNK: నడికూడ మండలం కంఠాత్మకూరు గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో రామకృష్ణ బుధవారం పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఆయన, పని ప్రదేశాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఈజీఎస్ సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.