AP: గల్ఫ్ ప్రవాస ఆంధ్రులకు మంత్రి వాసంశెట్టి భరోసా కల్పించారు. ఆయా దేశాల్లో ఉన్న ప్రవాస ఆంధ్రులతో మంత్రి వీడియో కాల్ చేసి మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. ఎవరూ ఆందోళన చెందొద్దని.. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. APNRTC హెల్ప్లైన్తో సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని మంత్రి సూచించారు.