SRPT: కోదాడ పట్టణంలో శనగల రాధాకృష్ణ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాధ ఆశ్రమంలోని మానసిక వికలాంగులు, చిన్నారులకు మంగళవారం హోళీ సందర్భంగా అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన జంపాల వెంకన్న-ఉమా దంపతుల ఆర్థిక సహకారంతో నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సేవా సంస్థ తరఫున దాతకు అభినందనలు తెలిపారు.