AP: ఎంపీ కేశినేని చిన్నిపై వైసీపీ నేత దేవినేని అవినాష్ మండిపడ్డారు. తిరువూరు ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వేణుగోపాలస్వామి కళ్యాణ కార్యక్రమాన్ని చెడగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. SC ఎమ్మెల్యే నియోజకవర్గంలో అతని రుబాబు ఏంటని ప్రశ్నించారు. తమ ఐదేళ్ల పాలనలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదని చెప్పారు. చంద్రబాబు, పవన్ దీనిపై సమాధానం చెప్పాలని అన్నారు.