సత్యసాయి: భగీరథ మహర్షి స్ఫూర్తితో రాష్ట్రంలో జల సంరక్షణను ఉద్యమంగా చేపట్టామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. తాడేపల్లిలో గురువారం భగీరథ మహర్షి విగ్రహానికి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నేతృత్వంలో పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. రాయలసీమకు నీటి సరఫరా కోసం భారీ నిధులు వెచ్చిస్తున్నామని తెలిపారు.