రాజన్న సిరిసిల్ల: జిల్లాలో 14 మహిళా స్వయం సహాయక సంఘ భవనాల నిర్మాణానికి ఎం.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులు మంజూరయ్యాయని జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ తెలిపారు. ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేసినట్లు వెల్లడించారు. బోయిన్పల్లి, చందుర్తి, ఇల్లంతకుంట, గంభీరావుపేట మండలాల పరిధిలోని పలు గ్రామాలకు ఈ నిధులు కేటాయించినట్లు స్పష్టం చేశారు.