KMM: మధిర పట్టణంలోని రాయపట్నం సెంటర్లో రోడ్డుపై అడ్డంగా ఆటోలు, టూవీలర్ బండ్లు నిలిపివేయడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు మధ్యలోనే వాహనాలు పార్క్ చేయడం వల్ల ట్రాఫిక్కు ఆటంకం కలుగుతోంది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో వెళ్లే వారికి మరింత ఇబ్బంది ఏర్పడుతోంది. అధికారులు స్పందించి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు.