MBNR: హన్వాడ మండలం యారోనిపల్లిలో తిరుమలనాథ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్వో కిష్ట్యా నాయక్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యశోదమ్మ, ఎంపీవో జగదీశ్వర్, సర్పంచ్ శవకూల స్వాతి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.