SRD: ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భవిత కేంద్రాలు, కస్తూర్బా పాఠశాలలో మరమత్తులను వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.