KRNL: బనగానపల్లెలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం రాత్రి మంత్రి బీసీ జనార్దన్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, పెన్షన్లు, ఉద్యోగ-ఉపాధి వంటి సమస్యలపై వచ్చిన వినతులను సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు.