PPM: పార్వతీపురంలో జీఎస్టీ నిధులతో పింక్ టాయిలెట్ నిర్మాణానికి ఏపీ జిఎస్టి కమిషనర్ పి. ఆనంద్ కుమార్, ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర శనివారం శంకుస్థాపన చేశారు. స్థానిక నాయకులు అధికారులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. జీఎస్టీ కమిషనర్గా దేశవ్యాప్తంగా సేవలందించిన ఆనందకుమార్ రాష్ట్రానికి అనేక పథకాలు తీసుకొచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.