HNK: ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామంలో VO. భవన నిర్మాణ పనులకు స్థానిక ఎంపీ కడియం కావ్య భూమి పూజ చేశారు. మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ పథకాలను అర్హులైన మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా లబ్ధి పొందాలని ఎంపీ కడియం కావ్య పిలుపునిచ్చారు. అనంతరం స్థానికులతో ఎంపీ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.