KNR: శంకరపట్నం మండలంలోని తాడికల్ రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు 5 రోజులుగా శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. ఎంపీవో ప్రభాకర్ అధ్యక్షతన జరిగుతున్న ఈ కార్యక్రమంలో కొత్తగట్టు, గొల్లపల్లి, లింగాపూర్తో సహా 12 గ్రామాల సభ్యులకు పంచాయతీరాజ్ చట్టం-2018పై అవగాహన కల్పించారు. నేటితో ఓరియంటేషన్ శిక్షణ ముగియనుంది.