పిల్లలు పిజ్జా, బర్గర్, కూల్ డ్రింక్స్ వంటి ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటిలోని ఉప్పు, కాల్షియం వల్ల 4 నుంచి 15 ఏళ్లలోపు వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తోంది. సకాలంలో గుర్తించకపోతే తీవ్రమైన ఇన్ఫెక్షన్, కిడ్నీ ఫెయిల్యూర్కు దారితీయవచ్చు. కాబట్టి చిన్నారుల డైట్ విషయంలో జాగ్రత్త అవసరం.