మెదక్ జిల్లా నుంచి బదిలీ అయిన కలెక్టర్ రాహుల్ రాజ్ తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపు పొందారు. గతంలో కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కార లక్ష్యంగా దూరాభారం తగ్గించేందుకు మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రేగోడ్, పెద్ద శంకరంపేట, నిజాంపేట్ మండలాలలో నిర్వహించారు.