AP: అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రా యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చారని మంత్రి లోకేష్ మండిపడ్డారు. 2019లో 29వ ర్యాంకులో ఉంటే 2023లో 76కి వెళ్లిందని పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు 41వ ర్యాంకుకు తీసుకొచ్చామని వెల్లడించారు. టాప్ 10 యూనివర్సిటీగా తీసుకురావాలన్నదే లక్ష్యమని చెప్పారు.