కోనసీమ: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. 40 కేంద్రాల్లో ఇంగ్లీష్ సెట్-2 ప్రశ్నపత్రంతో పరీక్ష నిర్వహించారు. మొత్తం 11,885 మందికి గాను 11,549 మంది హాజరయ్యారని, 336 మంది గైర్హాజరైనట్లు DIEO చంద్రశేఖర్ బాబు తెలిపారు. 97% మంది పరీక్ష రాశారని, జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఆయన తెలిపారు.