AP: ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షం క్రెడిట్ చోరీ చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘గతంలో నీళ్లు రాకుండా రిబ్బన్ కట్ చేశారు. మా కుప్పంకు కూడా నీళ్లు ఇస్తామన్నారు. పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టు దేశంలో మరెక్కడా ఉండదు. పుష్కరాల ముందే పోలవరాన్ని పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్రలో అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. త్వరలో చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేస్తాం’ అని తెలిపారు.