భారత యూజర్ల కోసం వాట్సాప్ సిమ్ వెరిఫికేషన్ను తెస్తోంది. దీంతో సైబర్ నేరాలకు చెక్ పెట్టనుంది. ఇప్పటివరకు ఫోన్లో సంబంధిత అకౌంట్ సిమ్ లేకపోయినా వేరే డివైజ్లో ఆ ఫోన్ నంబర్కు వచ్చే ఓటీపీతో వాట్సాప్లో లాగిన్ కావొచ్చు. దీంతో వేరే వ్యక్తులు వాట్సాప్ వాడుకునే అవకాశం ఉంది. కొత్త వెరిఫికేషన్తో సిమ్ ఫోన్లో ఉంటేనే లాగిన్ అవకాశం ఉంటుంది.