CTR: కుప్పం (M) మల్లనూరు హైస్కూల్ వెనుక వైపు భారీ కొండచిలువ మంగళవారం స్థానికులను హడలెత్తించింది. సుమారు 12 అడుగుల పొడవైన భారీ కొండచిలువ చెట్ల మధ్య బుసలు కొట్టడంతో యువత పట్టుకున్నారు. దీంతో ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు కొండచిలువను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఎక్కడైనా కొండచిలువలు కనిపిస్తే సమాచారం ఇస్తే వాటిని సురక్షితంగా పట్టుకుని అడవిలో వదలాలని సూచించారు.