KRNL: కేంద్ర ప్రభుత్వం 2027 గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందించే పద్మ పురస్కారాలు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతి రావు తెలిపారు. అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన వారు, పాల్గొన్న వారు అర్హులని చెప్పారు. దరఖాస్తు ఫామ్లు https://awards.gov.inలో లభిస్తాయని, మే 15లోపు ఆ వివరాలను తమకు అందజేయాలని ఆయన సూచించారు.