W.G: భూములకు సంబంధించి ఖచ్చితమైన వివరాల నమోదుకు ప్రభుత్వం చేపట్టిన రీసర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉప తహసీల్దార్ వర్ధనపు కిషోర్ కోరారు. రుస్తుంబాదలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన మాట్లాడారు. సర్వే ద్వారా భూ రికార్డులు పక్కాగా రూపొందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో సత్తిబాబు, సర్వేయర్ మణికంఠ, గ్రామస్థులు పాల్గొన్నారు.