SRCL: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు తొలి రోజు 4209 మంది విద్యార్థులు హాజరైనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 16 పరీక్ష కేంద్రాలలో నిర్వహించిన తొలి రోజు పరీక్షలో 4046 మంది రెగ్యులర్, 283 మంది ప్రైవేటు విద్యార్థులు కలిపి 4328 మంది విద్యార్థులకు గాను, 4209 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. అలాగే 119 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.