KDP: ప్రొద్దుటూరులో VIII అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు, అదనపు సివిల్ జడ్జి కోర్టులను జస్టిస్ కె. శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ బాలాజీ మేడమల్లి, జిల్లా న్యాయమూర్తి డా. యామిని, కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో సర్వమత గురువులు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమానికి బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.