W.G: నెట్ సెంటర్, ఏటీఎంలు ఏర్పాటు చేయిస్తామంటూ నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఘటన భీమవరంలో వెలుగు చూసింది. బాధితుడు గ్రంథం హరిప్రసాద్ ఫిర్యాదుతో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు పరిచయాన్ని ఆసరాగా చేసుకుని హరిప్రసాద్ నుంచి రూ.13.50 లక్షలు కాజేశారని, ఇదే ముఠా మరో ఇద్దరి వద్ద రూ.17 లక్షలు వసూలు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.