HYD: మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల నివారణకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తరహాలోనే వీటికి ఉచిత వ్యాక్సిన్ అందించనుంది. గ్రేటర్లో దాదాపు 56 లక్షల మంది మహిళలు ఉండగా ఇందులో 14- 26 ఏళ్ల వయసు వారు 12 లక్షల మందికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సమీప PHCలలో 6 నెలల వ్యవధిలో మూడు డోసుల టీకాలను ఉచితంగా వేయించుకోవచ్చని అన్నారు.