WGL: నర్సంపేట పట్టణంలోని వల్లభునగర్ కాలనీలో ఏళ్ల తరబడి నిరుపయోగంగా, చెత్తతో నిండి ఉన్న పురాతన బావికి ఎట్టకేలకు మోక్షం లభించింది. బావి దుస్థితి మున్సిపల్ ఛైర్మన్ శ్రీలక్ష్మీ రామానంద్ దృష్టికి రాగానే ఆమె వెంటనే స్పందించారు. బావిని పూర్తిగా శుభ్రం చేయించి, అందులోకి చెత్తాచెదారం పడకుండా పటిష్ఠమైన జాలిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.