E.G: పేద మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. ఆదివారం రాజమండ్రిలోని ఎమ్మెల్సీ కార్యాలయం వద్ద సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. పేద ప్రజల వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందజేసినట్లు ఆయన వెల్లడించారు.