AP: రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. మన్యం, అల్లూరి, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. మరోవైపు 27 మండలాల్లో వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.