W.G: ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియను ఈనెల 26లోపు పూర్తి చేస్తామని కమిషనర్ కృష్ణమోహన్ తెలిపారు. 2011 జనాభా లెక్కలు, ఈ ఏడాది జనవరి 1 నాటి ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల సంఖ్యను 20 నుంచి 28కి పెంచినట్లు పేర్కొన్నారు. ప్రతి వార్డులో సుమారు వెయ్యి మంది ఓటర్లు ఉంటారని, త్వరలోనే టౌన్ ప్లానింగ్ అధికారిని నియమించనున్నట్లు ఆయన తెలిపారు.