AKP: మునగపాక మండలం వాడ్రాపల్లిలో ఇవాళ గ్రామసభను ఎంపీడీవో ఉషారాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పలువురు గ్రామంలో సమస్యలను ప్రస్తావించారు. వెంటనే ఆమె స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.