HYD: ప్రకృతి వైపరీత్యాల సమయంలో యువ ఆపద మిత్రుల సేవలను వినియోగించుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. యువ ఆపదమిత్ర పథకంలో భాగంగా HYD జిల్లాకు చెందిన 105 మంది యువవాలంటీర్లు వారం రోజులపాటు ఫతుల్ గూడలో హైడ్రా శిక్షణ పొందారు. వారికి ధ్రువపత్రాలు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలు, వరదల సమయంలో హైడ్రాతో కలిసి పని చేయడానికి సిద్ధంగా అందుబాటులో ఉండాలన్నారు.