గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో రాజస్థాన్ 210/6 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు సూర్యవంశీ, జైస్వాల్ తొలి వికెట్కు కేవలం 6.2 ఓవర్లలోనే 70 పరుగులు జోడించి శుభారంభాన్ని ఇచ్చారు. సూర్యవంశీ (31) ఔటైనా, జైస్వాల్ (55) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం జురెల్(75) కూడా మెరుపు అర్ధశతకంతో చెలరేగడంతో స్కోర్ 200 మార్కును దాటింది. రబడ 2 వికెట్లు పడగొట్టాడు.