ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఆటగాడు సమీర్ రిజ్వీ ఈ IPL సీజన్లో సంచలనంగా మారాడు. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ GTపై 70, MIపై 90 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గాను వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ అతను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులను అందుకున్నాడు. వేగంగా పరుగులు సాధిస్తూ రిజ్వీ ఇప్పుడు ఢిల్లీ కీలక బ్యాటర్గా మారిపోయాడు.