అన్నమయ్య: హసనాపురం గ్రామంలోని శ్రీ ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, రమేష్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల పవిత్రతను కాపాడాలని, దేవుళ్లను రాజకీయాలకు లాగొద్దని వారు అన్నారు. తిరుమల లడ్డూ వివాదంపై సీఎం దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.