KRNL: కోడుమూరు పట్టణం, పరిసర గ్రామాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం రూ.39 కోట్ల నిధులను మంజూరు చేసింది. ప్రజల్ జీవన్ మిషన్ పథకం కింద విడుదలైన ఈ నిధులతో సంవత్సరాలుగా ఎదురవుతున్న నీటి కొరత తీరనుంది. శనివారం టీడీపీ పట్టణాధ్యక్షుడు గంగాధర్ నాయుడు, గోపాల్ నాయుడు మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు హామీలు ఇచ్చినా అమలు చేయలేదని విమర్శించారు.