ప్రకాశం: మార్కాపురం కలెక్టరేట్లో రోడ్డు ఏర్పాటుకై MRPS రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి సాలెంరాజ్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. కంభంలో 100 కుటుంబాలు నివాసముంటున్న మదర్ తెరిసా కాలనీకి రోడ్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు నిరసన ఆపేది లేదని అధికారులతో వాదించారు. కనిగిరి RDO ప్రాంతాన్ని పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.