KDP: డ్వాక్రా మహిళలకు AP ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారు ఆర్థికంగా ఎదిగేలా కృషి చేయనుంది. డ్వాక్రా మహిళలు ఎంచుకున్న రంగంలో పెట్టుబడులు పెట్టుకునేందుకు ఆర్థిక సాయాన్ని అందించనుంది. స్త్రీనిధి కింద డ్వాక్రా సంఘంలోని ఒక్కో సభ్యురాలికి ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ. 2 లక్షల వరకు రుణం ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని కేవలం 48 గంటల్లోనే అకౌంట్లోకి జమ చేయనుంది.