డిజిటల్ లావాదేవీలు మరింత భద్రం కానున్నాయి. RBI మార్గదర్శకాలు అనుసరించి ఇవాళ్టి నుంచి అన్ని డిజిటల్ లావాదేవీలకు టు-ఫ్యాక్టర్ అథంటికేషన్ అందుబాటులోకి వచ్చింది. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, వాలెట్లకు ఈ నిబంధన వర్తిస్తుంది. దీంతో ఇకపై లావాదేవీ పూర్తి చేయాలంటే రెండు వెరిఫికేషన్ అంచెలను పూర్తి చేయాలి. దీంతో ఎవరైనా మీ పిన్ తెలుసుకున్నా మీకు తెలీకుండా లావాదేవీ పూర్తి చేయడం సాధ్యం కాదు.