VZM: క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శుల సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ పోలీసు అధికారులకు బుధవారం సూచించారు. మహిళా సంరక్షణ కార్యదర్శులతో ప్రతీ వారం సమావేశాలు నిర్వహించి గ్రామాల్లోని సమస్యలు తెలుసుకుని శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలన్నారు.