చిత్తూరు జిల్లా నూతన వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శశిభూషణ్ రెడ్డి ఇవాళ ఉదయం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.