E.G: ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని స్వర్ణ వార్డు, ప్రకాష్ నగర్ ప్రాంతంలో లబ్ధిదారులను ప్రత్యక్షంగా కలుసుకుని, పింఛన్ సొమ్ము సక్రమంగా ఇంటి వద్దనే అందుతున్నదా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా పాల్గొన్నారు.